EPAPER
Saturday, April 18, 2026
Google search engine

కెనమాకులపల్లిలో కబడ్డీ పోటీలకు ముగింపు  విజేతలకు బహుమతుల ప్రదానం

📰 Generate e-Paper Clip

 

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 10:

 

 

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ పరిధిలోని కెనమాకులపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నారాయణస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. యువత ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ రాత్రి 10 గంటల నుండి శుక్రవారం తెల్లవారుజాము వరకు పోటీలు నిర్వహించారు. పోటీలలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు పాల్గొని ప్రతిభ కనబరిచాయి. పోటీలలో జ్ఞానవేలు క్రీడా బృందం మొదటి స్థానం సాధించి 30,116 రూపాయల బహుమతి అందుకుంది. శివ బ్రదర్స్ బృందం రెండవ స్థానం సాధించి 20,116 రూపాయలు, గుడిపల్లి బృందం మూడవ స్థానం సాధించి 15,116 రూపాయలు అందుకున్నారు. పల్లవి ఎక్స్ ప్రెస్ బృందం నాలుగవ స్థానం సాధించి 10,116 రూపాయలు, మురుగన్ బాయ్స్ బృందం ఐదవ స్థానం సాధించి 7,116 రూపాయలు పొందింది. లోకి బ్రదర్స్ బృందం ఆరవ స్థానం సాధించి 5,116 రూపాయలు, కంగుంది బృందం ఏడవ స్థానం సాధించి 4,116 రూపాయలు, ఎన్ జె పి సూపర్ స్టార్ బృందం ఎనిమిదవ స్థానం సాధించి 3,516 రూపాయలు అందుకుంది. గడ్డూరు బృందం తొమ్మిదవ స్థానం సాధించి 3,116 రూపాయలు, ఫ్రెండ్ బృందం పదవ స్థానం సాధించి 2,516 రూపాయలు పొందింది. కెబిటి బృందం పదకొండవ స్థానం సాధించి 2,116 రూపాయల బహుమతి అందుకుంది. వ్యక్తిగత ప్రతిభకు ఇచ్చిన బహుమతుల్లో జ్ఞానవేలు బృందానికి చెందిన ఏలుమలై ఉత్తమ దాడిదారుగా నిలిచాడు. గుడిపల్లి బృందానికి చెందిన అజిత్ ఉత్తమ పట్టువీరుడిగా గుర్తింపు పొందాడు. ఈ కార్యక్రమంలో కెనమాకులపల్లి గ్రామ పెద్దలు, యువకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!