కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 24:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో నిర్వహిస్తున్న రాత్రి మార్కెట్ను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ రాజు, డైరెక్టర్లు ఉదయి, ఇర్ఫాన్లతో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్కు తమ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతులతో వారు నేరుగా మాట్లాడి, విక్రయాల పరిస్థితి, ధరలు, మార్కెట్లో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ జరిగేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం కుప్పం మరియు నడుమూరు చెక్పోస్టులను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, తనిఖీ ప్రక్రియ, చెక్పోస్టుల నిర్వహణపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెక్పోస్టుల వద్ద సమర్థవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల ప్రయోజనాల పరిరక్షణ, పారదర్శక వ్యవస్థ ఏర్పాటే తమ ప్రధాన లక్ష్యమని ఏఎంసీ చైర్మన్ రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు.



Recent Comments