
కే.వి.బి పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 06:
కే.వి.బి పురం కిషోర్ వికాసం కార్యక్రమాన్ని సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు ఆదరం గిరిజన కాలనీలో కిషోర్ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సూపర్వైజర్ రాజేశ్వరి, కల్పలత ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా కిషోర్ బాలికలకు ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఐవిఆర్ కాల్స్ సేవల ప్రాముఖ్యత, వాటి ద్వారా పొందగల సమాచారంపై వివరించారు. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభివృద్ధికి దోహదపడే సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ కార్యకర్త శ్రీదేవి, బాలికలు పాల్గొన్నారు.


Recent Comments