EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి ప్రజలకు తడ పోలీసు అధికారి కొండపనాయుడు విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే09:

 

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని తడ పోలీసు అధికారి కొండపనాయుడు తెలిపారు. కరీంనగర్ ప్రాంతంలోని ఓ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పాల్గొన్న అనుమానితుల చిత్రాలను కరీంనగర్ పోలీసులు విడుదల చేసినట్లు తెలిపారు. నిందితులను త్వరగా గుర్తించి పట్టుకోవడంలో ప్రజల సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చిత్రాల్లో కనిపిస్తున్న వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీసు కేంద్రానికి లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తడ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం, భద్రత పరిరక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని కొండపనాయుడు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!