
పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అన్నారు. గురువారం పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 159 మంది డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ-సైకిళ్ల వినియోగంతో ఇంధన వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, ఆర్.వి. బాలాజీ, జనసేన, టీడీపీ నాయకులు, మెప్మా అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.


Recent Comments