
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 29:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార–జలహారతి 100 రోజుల కార్యాచరణలో భాగంగా తవణంపల్లి మండలంలో చెరువులు, ఫీడర్ కాలువల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు డ్వామా, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో చేపడుతున్న ఈ పనులు నీటి సంరక్షణకు తోడ్పడుతున్నాయి. జిల్లా జల వనరుల శాఖ పీడీ రవికుమార్ పనులను పరిశీలించి, జిల్లాలో ఇప్పటికే 1,500 చెరువులను పరిశీలించి, 600 పనులు ప్రారంభించామని తెలిపారు. తొలి విడతగా 1,024 పనులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత మెరుగుదలతో పాటు ఉపాధి హామీ కింద గ్రామీణ శ్రామికులకు ఆదాయం కలుగుతోందన్నారు. గ్రామస్థులు ఈ పనులతో నీటి సమస్యలు తగ్గడంతో పాటు గ్రామంలోనే ఉపాధి లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.


Recent Comments