
పెనుమూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 22:
పెనుమూరు మండలం చింతపెంట గ్రామంలో మహాభారత వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు మహాభారతంలో తొలి ఘట్టమైన ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ధర్మానికి నాంది పలికే ఈ పవిత్ర క్షణం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. “జై శ్రీకృష్ణా… జై మహాభారతం” నినాదాలతో కార్యక్ర మం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ధ్వజారో హణ పూజను చిరంజీవి రెడ్డి, శైలజ రెడ్డి దంపతులు నిర్వహించారు. అనంతరం గ్రామప్రజలు,పూజారులు, గణాచార్యులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం లో చింతపెంట గ్రామానికి చెందిన నాగరాజు రెడ్డి,కోదండ రెడ్డి,విశ్వ నాథ రెడ్డి,సుబ్రమణ్య రెడ్డి,రాజేష్, అమర్నాథ్, యుగంధర్, అశోక్,సీ.మోహన్ రెడ్డి, సీ.ఢిల్లీ బాబు,రాజా రెడ్డి,మురళి రెడ్డి, పరంధామ రెడ్డి,పురుషోత్తం రెడ్డి, యువరాజ్,గోపాల్ రెడ్డి,సురేందర్ రెడ్డి, దినేష్ రెడ్డి,సునీల్ రెడ్డి,జ్ఞాన శేఖర్, దేవ కుమార్,చంగల్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి, బాబు రెడ్డి, జి.మోహన్ రెడ్డి,ధనుంజయ రెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవి ధంగా చింతపెంట గ్రామమహిళలు కూడా పెద్దసంఖ్యలో హాజరై మహాభారత యజ్ఞాన్ని విజయవంతం చేశారు.


Recent Comments