EPAPER
Thursday, August 20, 2026
Google search engine

జలం – జీవన జ్యోతి మంజుల పత్తిపాటి 

📰 Generate e-Paper Clip

భువనగిరి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 22:

 

 

నిశీధిలోనూ వినిపించే నిశ్శబ్ద గానం— అది జలధారల మృదుస్పర్శ; చుక్కగా పడి నేలను తాకే వేళ, భూమి హృదయం హర్షంతో కొట్టుకుంటుంది।అదృశ్యంగా సాగిపోతున్న ప్రతి చుక్కలో, అనంతకాలపు ఆశలు దాగి ఉంటాయి; దాన్ని అర్థం చేసుకున్న మనసే మహోన్నతం, దాన్ని వృధా చేసిన వేళ కాలమే ప్రశ్నిస్తుంది। వెలుగు చూడని విత్తనాలకైనా జీవం ఇచ్చేది, నిశ్శబ్దంగా జారే నీటి కరుణ; ఆ కరుణను కాపాడే చేతులే, భవిష్యత్తు వేదికను నిర్మించే శిల్పులు। ఎండిన నేలపై పగుళ్లు పడిన వేళ, ఆర్తనాదం వినిపించేది ప్రకృతిదే; ఆ స్వరం అర్థం చేసుకున్న మనిషి,జలాన్ని దేవతగా భావించి కాపాడతాడు। ఇంటి తలుపు దగ్గర జారే ఒక చుక్కనుంచి,ప్రపంచపు ప్రవాహాల వరకూ— సంరక్షణ అనే ఒక చిన్న నిర్ణయం,విశాలమైన మార్పుకు మార్గదర్శకం అవుతుంది। జలమే కాదు—మనసాక్షి కూడా అదే, దాన్ని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడటం; చుక్కను దాచిన వేళ చరిత్ర నిలుస్తుంది. ప్రకృతికి మనం ఇచ్చే అతి పెద్ద కానుక ‘నీటి సంరక్షణ నీటిని ప్రతి ఒక్కరూ ఆదా చేయాలని కోరుకుంటూ… రచన: మంజుల పత్తిపాటి చరవాణి 9347042218 యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!