EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కుప్పంలో కట్టుదిట్టమైన బందోబస్తు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 16:

 

కుప్పం మండలంలో నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కుప్పం ఎస్‌డీపీఓ పార్థసారధి సూపర్‌విజన్‌లో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌డీపీఓ స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి అక్రమాలు, మోసాలు జరగకుండా పోలీసు అధికారులు నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని ఎస్‌డీపీఓ తెలిపారు. కుప్పం మండల పరిధిలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో సుమారు 2,500 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖతో పాటు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తీసుకున్న భద్రతా చర్యలను స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్వాగతిస్తూ విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించినందుకు పోలీసు అధికారులను అభినందించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!