
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 28:
మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో విద్యుత్ పోల్స్ సమస్యను కొన్ని రోజుల క్రితం మాజీ ఏఎంసి చైర్మన్ సత్యేంద్ర శేఖర్, క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, వార్డు టిడిపి ఇంచార్జ్ రవి, ఏఎంసీ డైరెక్టర్ ఇర్ఫాన్ పరిశీలించారు. కాలనీలో కరెంట్ పోల్స్ సమస్య అధికంగా ఉందని స్థానికులు పేర్కొన్న నేపథ్యంలో రెస్కో సిబ్బందిని పిలిపించి కాలనీలో ఏ మేరకు కరెంట్ ఫోల్స్ అవసరం ఉందని అంచనా వేశారు. త్వరలోనే కాలనీలో కరెంట్ పోల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని రెస్కో డైరెక్టర్ ఆర్ముగం హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం ఎన్టీఆర్ కాలనీలో నూతన కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.


Recent Comments