వీకోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 15:
చిత్తూరుజిల్లా పలమనేరు నియోజక వర్గం, వీకోట మండలంలోని మహా శివరాత్రి మహోత్సవంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భక్తి సమృద్ధి ఆవిర్భవించింది. గ్రామ ప్రజల భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఉదయాన సూర్యోదయంతోనే అర్చక స్వాములు స్వామివారికి రుద్రాభిషేకం, మహా మంగళ హారతులు నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి భక్తాదులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తాదులు, గ్రామస్తులు క్యూలు కట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని ఉత్సవాలను మరింత ఉల్లాసంగా నిర్వహించారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఈ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని భక్తులు అన్నారు. రాత్రి ప్రదృశ్వరాత్రి పూజలు కూడా జరిగాయి.


Recent Comments