
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూన్ 21:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రాళ్లబుదుగూరు ఉన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, వంటశాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా, పోషక విలువలతో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి విద్యార్థికి సమయానికి నాణ్యమైన భోజనం అందేలా పాఠశాల యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం,వంటశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు వివరాలను తెలుసుకుని ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెస్కో డైరెక్టర్ ఎస్. బసవరాజు, యూనిట్ ఇన్చార్జ్ ఆర్.ఎస్. మణి, స్థానిక నాయకులు బియ్యం కుమార్, ఎం.ఆర్. నారాయణ, మురళి, అశోక్, ఆనంద్, రమేష్, పంచాయతీ కార్యదర్శి శివశంకరయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Recent Comments