పీలేరు పట్టణంలోని వి.ఎస్.ఆర్. కళ్యాణ మండపంలో పీలేరు, కలికిరి, కే.వి.పల్లి మండలాలకు సంబంధించిన సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ సార్ ప్రక్రియ పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఏ బలమని ఓటర్ నమోదు మార్పులు సవరణలు అభ్యంతరాలు పరిష్కారాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి , ఏపీఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్ రెడ్డి , పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, నల్లారి తిమ్మారెడ్డి , డా. ఇక్బాల్ అహ్మద్ ఎంపీపీ సతీష్ రెడ్డి, జెడ్పిటిసి రత్నశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి , సుంకర చక్రధర్ పెద్దిరెడ్డి ,ద్వారకనాథ్ రెడ్డి, భువనేశ్వర్ రెడ్డి ,లోకనాథరెడ్డి కాలనీ చిన్న, ఆనంద, మునీర్ ,షాకీర్ ,శ్రీనాథరెడ్డి ,జైపాల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.



Recent Comments