EPAPER
Thursday, August 20, 2026
Google search engine

నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 04:

 

శ్రీకాళహస్తి పర్యావరణం ప్రకృతి పై ఆసక్తి ఆచరణ చొరవ పర్యావరణ పై అవగాహన కార్యక్రమాలు ప్రగతి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణం విద్యపై అనేక అవగాహన కార్యక్రమాలు విద్యార్థి దశనుండే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ విద్యపై విద్యార్థులకు డ్రాయింగ్ వకృత్వం క్విజ్ పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులతో కలిసి బాలల సంఘాలు ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నారు ఆయన తెలిపారు. ప్రగతి స్వచ్ఛంద సంస్థ క్రైసంస్థ సహకారంతో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో సుమారు 55 గ్రామాల్లో పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ సచివాలయం పంచాయతీ కార్యాలయంలో పాఠశాల ఆవరణలో గోడల పై నాలుగు రోడ్ల కూడలి వద్ద ప్రకృతిని కాపాడండి మొక్కలు నాటుదాం వాతావరణ కాలుష్యం నివారిద్దాం తదితర అంశాల పై నినాదాలతో కూడిన అందమైన రంగుల తో చిత్రాలు వేసి పర్యావరణ పై రంగురంగుల చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం పై ఆలోచించే విధంగా ఈ చిత్రాలు గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ అభివృద్ధికి ఆలోచించే విధంగా గోడలు పై చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి రోజురోజుకీ వాతావరణంలో వస్తున్న మార్పులు ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్న అందువలన మొక్కలు నాటే విధంగా ఆలోచిస్తారని ఆయన తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!