కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 30:
కుప్పం బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదంతో రాబోయే రెండు సంవత్సరాల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సోమవారం ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు గా వి.ఎస్.శ్రీకాంత్ ఉపాధ్యక్షులు సిద్ధవటం నాగరాజు ప్రధాన కార్యదర్శి కె.ఉదయ్ కుమార్ సంయుక్త కార్యదర్శి కె.వి.వాసు కోశాధికారి జి.పుష్పలత జాయింట్ ట్రెజరర్ పి.ఆర్.వివేక్ లైబ్రరీ సెక్రటరీ ఏ.ఆర్.ధనశేఖర్ జాయింట్ లైబ్రరీ సెక్రటరీ పళని స్పోర్ట్స్ సెక్రటరీ ఆర్.అనిల్ కుమార్ స్పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ జలపతి లేడీ సెక్రటరీ వి.ఎస్. శైలశ్రీ లేడీ జాయింట్ సెక్రటరీ కె.చందన ప్రియ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం మరియు బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అత్యధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని నూతన కార్యవర్గానికి తమ మద్దతును ప్రకటించారు.


Recent Comments