కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 28:
కుప్పం మునిసిపల్ పరిధిలోని 12వ వార్డులో శనివారం తెల్లవారుజామున నుంచి వార్డులో వార్డు మాజీ ఏఎంసి చైర్మన్ సత్యేంద్ర శేఖర్, క్లస్టర్ ఇంచార్జీ కన్నన్, కౌన్సిలర్ కస్తూరి వేలు, మాజీ సర్పంచ్ మణి, టీడీపీ ఇంచార్జీ రవి, వార్డు అధ్యక్షుడు, ఏఎంసి డైరెక్టర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకటో తేది ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా శనివారమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు.


Recent Comments