chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 9:35 am Digital Edition : CHITTOORE EXPRESS

10వ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన నిఘా…  కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత  సీఐ జయచంద్ర

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి16:

 

2026 మార్చిలో జరుగుతున్న మొదటిరోజు 10వ తరగతి పరీక్షల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సిబ్బంది పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేత,సీసీటీవీ నిఘా, మరియు నిమిషం ఆలస్యమైనా అనుమతించని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.ఇందులో భాగంగా పట్టణంలోని ఆరు సెంటర్లకు రేణిగుంట అర్బన్ సీఐ జయ చంద్ర పోలీసుల సిబ్బంది సెంటర్ల వద్ద ప్రత్యేక నిగా పెట్టారు.