chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 12:46 pm Digital Edition : CHITTOORE EXPRESS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన టిడిపి నాయకులు

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 12:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ ప్రజల పట్ల చూపుతున్న మానవత్వానికి మరో నిదర్శనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.పేదల ఆరోగ్య అవసరాలకు భరోసా ఇస్తూ ఆస్పత్రి ఖర్చులు భరించలేని కుటుంబాలకు కొత్త జీవన ఆశను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, రెస్కో చైర్మన్ ప్రతాప్, టిటిడి బోర్డు సభ్యులు శాంతారాం, కడ మెంబర్ రాజకుమార్, మున్సిపల్ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్, క్లస్టర్ ఇంచార్జ్ కౌన్సిలర్ ఎస్.సోమశేఖర్, యూనిట్ ఇంచార్జ్‌లు ఆర్ఆర్ రవి, వేణు,నాగార్జున, కౌన్సిలర్ దాము, జాకీర్ పాల్గొన్నారు.తెలుగుదేశం పార్టీ విస్తరణ సభ్యులు మంజునాథ్, కో క్లస్టర్ శ్యామ్, కో యూనిట్ సురేష్, రెస్కో డైరెక్టర్ శివ, గంగమ్మ గుడి డైరెక్టర్ జయరాం, శారదమ్మ, బూత్ ఇంచార్జ్‌లు చంద్ర, వినయ్, కాసిం, ఉమర్, బాలు, విష్ణు, జాలు, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, కందస్వామి, మహిళలు తెలుగు దేశం పార్టీ వార్డ్ అధ్యక్షులు జమీర్, ముజిబ్, రాధ, గాయత్రి, గీత, 20వ వార్డ్ రమేష్, ముని, ఫయాజ్ అందరూ ఉన్నారు.