
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 07:
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 16,17,20 వార్డుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గవర్నమెంట్ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుధీర్, క్లస్టర్ ఇంచార్జ్ సోమశేఖర్, కో క్లస్టర్ శ్యాంసుందర్, యూనిట్ ఇంచార్జ్ ఆర్ ఆర్ రవి, కౌన్సిలర్ జాకీర్, గొపినాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, తెలుగుదేశం నాయకుడు మంజునాథ్, కో యూనిట్ నాను, వార్డు అధ్యక్షులు మంజునాథ్, శ్రీధర్,ప్రకాష్,బూత్ ఇంచార్జులు విష్ణు,సుబ్బన్న,లోకేష్,గీత, ముజిబ్,కాసిం తదితరులు పాల్గొన్నారు.