వీ.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 13:
సనాతన ధర్మానికి పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అలాగే తను ఉన్న గ్రామంలో అభివృద్ధి వైపు వెళ్దాం అనే పుస్తకం స్థాపించిన చిత్తూరు జిల్లా వీకోట మండలానికి చెందిన ఉదయ్ కుమార్ జనసేన కార్యకర్త, తన స్థాపించిన పుస్తకాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పూజలు చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత ఆవిష్కరించాలని వీకోట నుంచి తిరుమలకు దాదాపు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ. మా గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని సనాతన ధర్మమే కాదు గ్రామాల్లో అభివృద్ధి కూడా జరగడంలేదని దానికి అనుకూలంగా ఓ పుస్తకం రాసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత ఆవిష్కరించాలని తన కోరిక అన్నాడు. అందుకని గ్రామాల్లో ఎక్కడ గాని పేరుకే అధికారం ఉంటుందే కానీ ఎటువంటి అభివృద్ధి జరగదని జరగనివ్వరని దీనికి ఉదాహరణ మా గ్రామంలో అభివృద్ధి జరగలేదని పలు అంశాలని పుస్తకం రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల పైన దృష్టి సాదించాలని జనసేన పవన్ కళ్యాణ్ కు పుస్తకం ద్వారా తీసుకెళ్తానని ఉదయ్ కిరణ్ అన్నాడు.. పాదయాత్ర సమయంలో యువకుడుకు ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకుడు పొట్టు భాస్కర్.