శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:
శ్రీకాళహస్తి పట్నంలోని పెళ్లి మండపం వద్ద సోమవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేలచూరు చంద్రశేఖర్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కన్వీనర్ పాండురంగయ్య మాట్లాడుతూ రాబోవు 24వ తేదీ సత్యసాయి వర్ధంతి సందర్భంగా సత్య సాయి వర్ధంతి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అలాగే 24వ తేదీ మహా నారాయణ సేవ బాలవికాస్ పిల్లలకు వేసవి తరగతుల ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ పాండురంగయ్య సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.