
పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 02:
అన్నమయ్యజిల్లా పీలేరు మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వి.హరిప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వక ముగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని , ప్రచార విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు అన్నారు.