chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 10:20 am Digital Edition : CHITTOORE EXPRESS

రేణిగుంట సంతలో పోలీసుల ఫుట్ పాట్రోలింగ్  ప్రజలకు అవగాహన

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి14:

 

 

రేణిగుంట పట్టణంలోని సండీ ప్రాంతంలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా శనివారంరోజు రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తమ సిబ్బందితో కలిసి ఫుట్ పట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి అక్కడి ప్రజలు,ఆటో డ్రైవర్లతో మాట్లాడి సైబర్ నేరాలపై జాగ్రత్తలు,ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసర,మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలు అపరిచి తుల నుంచి వచ్చే కాల్స్,మెసేజులకు స్పందించకూడదని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.