శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రాళ్ళబూదుగూరులో 893వ బసవేశ్వర జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. చిన్నారి దొడ్డి గ్రామంలో వెలసిన శ్రీబసవేశ్వర స్వామి దేవాలయంలో పూజాది కార్యక్రమాలను నిర్వహించి, భక్తిశ్రద్ధలతో బసవేశ్వరుని పూజించారు. అనంతరం బసవేశ్వరుని తత్వాన్ని ప్రచారం చేయా లని సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను లింగ వివక్షను వ్యతిరేకించాల ని ఈ సందర్భంగా తెలియజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెస్కో డైరెక్టర్ ఎస్ బసవరాజు,పరమశివం,మూర్తి,ఉమా శంకర్,కుమార్,చుట్టుపక్కల భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.