కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 30:
కుప్పం పట్టణం 19వ వార్డులో కొనసాగుతున్న రాజు కాలువ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డా కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ వాటిని మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లు జిమ్ దాము, సోము, మాజీ ఎంపీపీ వెంకటేష్, ఆర్ముగం, బాలాజీ, శివకుమార్, చంద్రశేఖర్, రాజా విజయ్, రాధా, శశి, బుజ్జి దేవా తదితర నాయకులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.