chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 4:39 am Digital Edition : CHITTOORE EXPRESS

పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం కమిషనర్ శ్రీనివాసరావు

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 28:

 

కుప్పంమున్సిపల్ పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో విజయ వంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిపాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.., పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. ఐదేళ్లలోపు ఉన్న ప్రతిచిన్నారికి తప్పనిసరిగా పోలియోచుక్కలు వేయించి అంగవైకల్యం బారినపడ కుండా కాపాడాలని తల్లిదండ్రులకు సూచించారు. “మన చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పోలియోను పూర్తిగా నిర్మూలించాలి. రెండు చుక్కల పోలియో మందు ప్రతి బిడ్డకు రక్షణకవచంలా పనిచేస్తుంది. తల్లిదండ్రులందరూ సహకరించి ప్రతిచిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి”  అని కమిషనర్ పిలుపునిచ్చారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు,అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.