chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 12:13 pm Digital Edition : CHITTOORE EXPRESS

భక్తులకు అన్నదాన పంపిణీ కార్యక్రమం 

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 03:

 

శ్రీకాళహస్తి లోక్ సత్తా పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్, దివంగత టి. లోకేష్ బాబు 8వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు విచ్చేసిన భక్తులకు ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. వర్ధంతి సందర్భంగా భక్తులకు సేవ చేయడం ద్వారా లోకేష్ బాబు సేవాస్ఫూర్తిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో లోకేష్ బాబు సోదరుడు, స్కౌట్స్ కార్యాలయ కమిషనర్ టి. రమేష్ బాబు, సభ్యులు అజార్ తదితరులు పాల్గొన్నారు.