chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 7:33 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రతిక్షణం ప్రజల మధ్యలో ప్రజలసమస్యల పరిష్కారమే ధ్యేయం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 04:

 

తిరుపతిజిల్లా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సూళ్లూరు పేట నియోజకవర్గంలోని ఆరుమండలాలు రెండు మున్సిపాలి టీలలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలనె ముఖ్య ఉద్దేశంతో ప్రజాదర్బార్ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని, నియోజక వర్గంలో త్రాగునీరు,కరెంటు,రోడ్లు,రెవెన్యూ సమ స్యలు,ఇలా నియోజకవర్గంలోని సమస్య ఉన్న తమదృష్టికి తీసుకుని రావాలి ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు షేక్ 786రఫీ పరసారాజ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అర్జీదారులు పాల్గొన్నారు.