chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 7:36 am Digital Edition : CHITTOORE EXPRESS

తిరుమల పవిత్రతను కాపాడాలని, మండల పరిషత్ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో  శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు   

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 04:

 

తిరుపతిజిల్లా సూళ్లూరుపేట నియోజక వర్గం సూళ్లూరుపేటలో శనివారం రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సూళ్లూరుపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల పవిత్రతను కాపాడాలని,బిఆర్ నాయుడు టిటిడి బోర్డ్ చైర్మన్ గా కొనసాగే అర్హత తనకు లేదని,వెంటనే తొలగించాలని సూళ్లూరు పేట పార్క్ స్ట్రీట్ లో గల శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీశ్రేణులు పూజాకార్యక్రమం నిర్వహిం చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మంచిబుద్ధి ప్రసాదించాలని శ్రీవెంకటేశ్వర స్వామి వేడుకున్నారు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా బిఆర్ నాయుడు వ్యవహార శైలి ఉందని, అటువంటి వ్యక్తిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో సూళ్లూరుపేట మండలంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.