chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 9:53 pm Digital Edition : CHITTOORE EXPRESS

టపాసుల గోదాములపై ఆకస్మిక తనిఖీలు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి  గోదాము యజమానులకు డీఎస్పీ పార్థసారథి సూచనలు

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 14:

 

 

కుప్పం పట్టణంలో లైసెన్సు పొందిన టపాసుల గోదాములను కుప్పం డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ శంకరయ్య సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు వారు తెలిపారు. టపాసుల నిల్వ, భద్రతా ఏర్పాట్లు, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాముల యజమానులకు పలు సూచనలు చేశారు. లైసెన్సులో పేర్కొన్న పరిమితికి మించి టపాసులను నిల్వ చేయరాదని స్పష్టం చేశారు. గోదాములలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తగిన భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. టపాసుల దగ్గర ప్రమాదకర వస్తువులు లేదా నిప్పుకు సంబంధించిన పదార్థాలు ఉంచకూడదని హెచ్చరించారు. అదేవిధంగా గోదాముల్లో విద్యుత్ వైర్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, ఎటువంటి మంటలు లేకుండా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. గోదాము పరిసర ప్రాంతాల్లో ధూమపానం పూర్తిగా నిషేధమని, అందుకు సంబంధించి బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.