chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 6:57 am Digital Edition : CHITTOORE EXPRESS

జనసేన నాయకుడు ఆకులు గజేంద్రప్రసాద్  పెద్దపంజాణిలో ఆత్మీయ పలకరింపు 

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:

 

పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం కత్తర్లపల్లి లో కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆకుల గజేంద్రప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత స్వభావం తన స్వభావం ఒకేలాగే ఉండడంవల్ల జనసేన పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు పలమనేరు నియోజకవర్గం మొత్తం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. కార్యక్రమానికి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు పూల చైత న్య , ఏఎంసీ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ ,గంగవరం మండల ప్రెసిడెంట్ చంద్ర, పలమనేరు మండలం రూరల్ నాయకుడు నాగరాజు, పెద్దపంజాణి మండలం ప్రెసిడెంట్ శివ, బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.