chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 11:01 am Digital Edition : CHITTOORE EXPRESS

జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం 

 

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 13:

 

 

తుమ్మిసి తులసి జడ్పీ హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఫేర్‌వెల్ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సందేశాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్కూల్ చైర్మన్ వరదరాజులు, చలపతి స్వామి, రోసి మేడం, బి.కె. మంజునాథ్, నాగరాజు, నవీన్ కుమార్ మరియు శ్రావణి పాల్గొన్నారు. వారు విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలు, విద్య యొక్క ప్రాముఖ్యత మరియు జీవితంలో క్రమశిక్షణ అవసరం గురించి విలువైన సందేశాలు అందించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆనందోత్సాహాలతో సాగి, పదవ తరగతి విద్యార్థులకు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అలాగే ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఆటపాటల్లో గెలుపొందున విద్యార్థులకు బహుమతులను అందజేశారు.