chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 10:27 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఘనంగా పరిగి ఎంపీడీఓ రెడ్డప్ప పదవీ విరమణ సన్మాన మహోత్సవం.

పెనుకొండ/పరిగి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 30:

 

శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. రెడ్డప్ప మంగళవారం 40 సంవత్సరమల సర్విస్ ను పూర్తి చేసుకొని పదవీ విరమణ సందర్భముగా పదవీ విరమణ వీడ్యోలు సభ మంగళవారం పరిగి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనము నందు ఘనంగా జరుపుకొన్నారు.ఎంపిడిఓ రెడ్డప్ప దంపతులకు శాలువాలు కప్పి పూలహారాలు, బోకేలతో ఘన సన్మానం చేశారు. హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలనీ, శేషాజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా సభికులు కోరారు.పదవీ విరమణ వీడ్యోలు సభకు తహసిల్దార్ హసీనా సుల్తానా, బీచగాని పల్లి సర్పంచ్ బాలాజీ, ఎంపీటీసీ సభ్యులు,ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతి ప్రత్వేక అధికారులు, గ్రామ పంచాయతి అభివృద్ధి అధికారులు – సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది, ఎంజీ ఎన్ ఆర్ జీ ఎస్ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు సిబ్బంది ,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.