chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 8:28 am Digital Edition : CHITTOORE EXPRESS

గ్రేస్ మేరియా చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 03:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురానికి చెందిన గ్రేస్ మేరియా చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, జట్టు భావన, క్రమశిక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామీణ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి గ్రేస్ మేరియా చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రస్టీ ఆరోకియా రాజ్, సెక్రటరీ జేసుమారి, సభ్యులు అబ్దుల్లా, దీపక్, పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రమౌళి పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.