
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 15:
కుప్పం మండలం గోనుగూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు దేశభక్తి, సేవాభావంతో దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, అభివృద్ధికి పాటుపడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.