chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 11:51 am Digital Edition : CHITTOORE EXPRESS

కృష్ణాపురం జలాశయంలో చేపల ఉత్పత్తిని పెంచుతాం ఎమ్మెల్యే సోదరుడు రాజా 

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి12:

 

కృష్ణాపురం జలాశయంలో చేపల ఉత్పత్తిని పెంచుతామని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సోదరుడు కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు గురువారం కార్వేటినగరం జలాశయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సుమారు 18 వేల చేపల పిల్లలను కృష్ణాపురం జలాశయంలో పూజలు చేసి వదిలారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరుడు రాజా మాట్లాడుతూ ఈ చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు మరి జీవనోపాధి ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకాలు ఎంత గొప్ప పడుతుందని తెలియజేశారు ఈ చేపల ఉత్పత్తి పెరుగుదలకు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షుడు చెంగల్రాయ్ యాదవ్, కార్వేటినగరం సహకార సంఘం చైర్మన్ జనార్దన్ రాజు మార్కొండ రెడ్డి మత్స్య సహకార సంఘ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి, బీగాల రమేష్, అన్నామలై టిడిపి నాయకులు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.