chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 9:45 am Digital Edition : CHITTOORE EXPRESS

ఓటు మనకు విలువైనదే.. బి ఎల్ వోలు అప్రమత్తంగా ఉండాలి..  జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి

గంగాధర నెల్లూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 10:

 

జే బ్రాండ్ ను అమ్మి కుటుంబ వెలుగును ఆర్పిన నాయకుడు నారాయణస్వామి… ఐ వి ఎఫ్ ద్వారా కుటుంబానికి వెలుగునిచ్చిన వ్యక్తి తామస్ అని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి అన్నారు బుధవారం గంగాధర్ నెల్లూరు మండలం కేంద్రంలో బిఎల్ఎ ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి మాట్లాడుతూ.. పల్లెటూరు భాషలో అల్లా గుంట ముద్దుబిడ్డ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ వారసుడిగా మన తామస్ ఉన్నారు ఆయన ఇంకా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు.. బి ఎల్ ఏ లు అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఓటు మనకు విలువైనదే అని తెలియజేశారుఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు మండలాధ్యక్షుడు స్వామి దాస్,ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణం నాయుడు పెనుమూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరుల్ నాదన్ ఆరు మండలాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.