
ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 17:
అమరావతి అసెంబ్లీ సమావేశంలో అనంతరం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను పారిశ్రామికవేత్త మాదిరాజు గణేష్ రాజు కుమార్ రాజు,ఎమ్మెల్యే సోదరుడు ఆదాం సుందర్ రాజన్.. మర్యాదపూర్వకంగా కలిశారు.. కార్వేటి నగరం మండలం కృష్ణాపురం జలాశయం అభివృద్ధికి కృషి చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కు వినతి పత్రం అందించారు.. కృష్ణాపురం జలాశయం కుడి ఎడమ కాలువలు దుస్థితికి చేరాయని అలాగే కృష్ణాపురం జలాశయం గేట్లు మరమ్మతుకు గురిందని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కు తెలియజేయడంతో కృష్ణాపురం జలాశయం గేట్ల మరమ్మత్తును అలాగే జలాశయం అభివృద్ధికి కృషి చేస్తానని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.