chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 6:30 am Digital Edition : CHITTOORE EXPRESS

అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం యువకుడికి తీవ్ర గాయాలు

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 30:

 

రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు, బలరాం అనే యువకుడు రహదారి దాటుతున్న సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మాయగుంట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తుండగా రహదారి దాటుతున్న బలరాంను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం తీవ్రతకు బలరాం రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అత్యవసర అంబులెన్స్ సిబ్బంది సహాయంతో గాయపడిన బలరాంను తిరుపతిలోని రూయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. బలరాం స్థానికంగా ఓ టీ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.